భరోసా కేంద్రాన్ని ప్రారంభించిన మంత్రి జగదీష్‌రెడ్డి

ABN , First Publish Date - 2021-08-09T20:08:11+05:30 IST

దేశంలోనే భరోసా కేంద్రం తొలి ప్రయోగమని మంత్రి జగదీష్ రెడ్డి అన్నారు. సోమవారం ఆయన భరోసా సెంటర్‌ను ప్రారంభించారు.

భరోసా కేంద్రాన్ని ప్రారంభించిన మంత్రి జగదీష్‌రెడ్డి

నల్గొండ: దేశంలోనే భరోసా కేంద్రం తొలి ప్రయోగమని మంత్రి జగదీష్ రెడ్డి అన్నారు. సోమవారం ఆయన భరోసా సెంటర్‌ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తప్పనిసరి పరిస్థితుల్లో భరోసా కేంద్రానికి వచ్చే వారికి న్యాయం జరిగేలా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. సీఎం కేసీఆర్ నూతన పద్ధతుల్లో పాలన సాగిస్తున్నారని కొనియాడారు. సమర్థులైన అధికారుల ఎంపికతో రాష్ట్రంలో శాంతి భద్రతలు పక్కాగా అమలవుతున్నాయని చెప్పారు. నేరాల అదుపునకు ఇతర రాష్ట్రాలు.. తెలంగాణ పోలీసుల సహకారం తీసుకోవడమే ఇందుకు నిదర్శనమని జగదీష్ రెడ్డి తెలిపారు.

Updated Date - 2021-08-09T20:08:11+05:30 IST