జగదీష్‌రెడ్డి మళ్లీ గెలిస్తే నేను దేనికైనా సిద్ధం: రాజగోపాల్‌రెడ్డి

ABN , First Publish Date - 2021-10-03T21:17:51+05:30 IST

టీఆర్ఎస్ నేతలు రాజకీయాలను భ్రష్టు పట్టిస్తున్నారని ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి ధ్వజమెత్తారు.

జగదీష్‌రెడ్డి మళ్లీ గెలిస్తే నేను దేనికైనా సిద్ధం: రాజగోపాల్‌రెడ్డి

హైదరాబాద్: టీఆర్ఎస్ నేతలు రాజకీయాలను భ్రష్టు పట్టిస్తున్నారని ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి ధ్వజమెత్తారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ అవినీతి డబ్బుతో మళ్లీ అధికారంలోకి రావాలని చూస్తున్నారని చెప్పారు. మంత్రి జగదీష్‌రెడ్డి మళ్లీ సూర్యాపేటలో గెలిస్తే తాను దేనికైనా సిద్ధమని రాజగోపాల్‌రెడ్డి సవాల్ విసిరారు. గత ఎన్నికల్లో నకిరేకల్‌లోచాలెంజ్ చేసి చూపించానని, మళ్లీ తన చాలెంజ్ స్వీకరించాలని సవాల్ విసిరారు. మునుగోడులో పిచ్చి వేశాలు మానుకోవాలని హెచ్చరించారు. మునుగోడులో దళితబంధు అమలు చేస్తే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని రాజగోపాల్‌రెడ్డి ప్రకటించారు.

Updated Date - 2021-10-03T21:17:51+05:30 IST