వైసీపీ శాశ్వత అధ్యక్షుడిగా జగన్‌

ABN , First Publish Date - 2022-07-10T08:19:18+05:30 IST

వైసీపీ శాశ్వత అధ్యక్షుడిగా జగన్‌

వైసీపీ శాశ్వత అధ్యక్షుడిగా జగన్‌

ముందే చెప్పిన ‘ఆంధ్రజ్యోతి’

అమరావతి, జూలై 9 (ఆంధ్రజ్యోతి): వైసీపీ శాశ్వత అధ్యక్షుడిగా వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డిని ఆ పార్టీ ప్లీనరీ ఎన్నుకున్నట్లు పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డి శనివారం ప్రకటించారు. ఆయన్ను ఈ పదవిలో ఎన్నుకోనున్నట్లు ‘ఆంధ్రజ్యోతి’ గురువారమే వెల్లడించింది. ప్లీనరీ తొలిరోజున శుక్రవారం అధ్యక్ష పదవి కోసం నామినేషన్లను స్వీకరించారు. జగన్‌ ఒక్కరే నామినేషన్‌ వేశారు. ఆయన్ను జీవితకాల అధ్యక్షుడిగా నియమించేందుకు వీలుగా పార్టీ రాజ్యాంగానికి చేసిన సవరణకు ప్లీనరీ ఆమోదం తెలిపింది. కాగా.. ప్లీనరీ చివరిరోజు పారదర్శక పాలన-సామాజిక సాధికారత, పరిశ్రమలు, వ్యవసాయం తదితర అంశాలపై తీర్మానాలను ఆమోదించారు.

Updated Date - 2022-07-10T08:19:18+05:30 IST