సీఎం జగన్ బెయిల్ రద్దుపై నేడు విచారణ
ABN , First Publish Date - 2021-06-14T15:13:07+05:30 IST
సీఎం జగన్ బెయిల్ రద్దు పిటిషన్పై సోమవారం సీబీఐ కోర్టులో విచారణ జరగనుంది
హైదరాబాద్: ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి బెయిల్ రద్దు చేయాలంటూ ఎంపీ రఘురామ కృష్ణంరాజు వేసిన పిటిషన్పై సోమవారం సీబీఐ కోర్టులో విచారణ జరగనుంది. బెయిల్ రద్దు పిటిషన్పై ఈ నెల 1న జగన్ కౌంటర్ దాఖలు చేశారు. కౌంటర్లో జగన్ పేర్కొన్న అంశాలపై రఘురామ సమాధానం ఇవ్వనున్నారు. రాజకీయ, వ్యక్తిగత ప్రయోజనాల కోసమే రఘురామ పిటిషన్ వేశారని జగన్ కౌంటర్లో పేర్కొన్నారు. రఘురామ తనపై ఉన్న సీబీఐ కేసులను ప్రస్తావించలేదన్నారు.