సీఎం జగన్ బెయిల్ రద్దుపై నేడు విచారణ

ABN , First Publish Date - 2021-06-14T15:13:07+05:30 IST

సీఎం జగన్ బెయిల్ రద్దు పిటిషన్‌పై సోమవారం సీబీఐ కోర్టులో విచారణ జరగనుంది

సీఎం జగన్ బెయిల్ రద్దుపై నేడు విచారణ

హైదరాబాద్: ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి బెయిల్ రద్దు చేయాలంటూ ఎంపీ రఘురామ కృష్ణంరాజు వేసిన పిటిషన్‌పై సోమవారం సీబీఐ కోర్టులో విచారణ జరగనుంది. బెయిల్ రద్దు పిటిషన్‌పై ఈ నెల 1న జగన్ కౌంటర్ దాఖలు చేశారు. కౌంటర్‌లో జగన్ పేర్కొన్న అంశాలపై రఘురామ సమాధానం ఇవ్వనున్నారు. రాజకీయ, వ్యక్తిగత ప్రయోజనాల కోసమే రఘురామ పిటిషన్ వేశారని జగన్ కౌంటర్‌లో పేర్కొన్నారు. రఘురామ తనపై ఉన్న సీబీఐ కేసులను ప్రస్తావించలేదన్నారు.

Updated Date - 2021-06-14T15:13:07+05:30 IST