జగన్ దగా చేస్తున్నాడు!
ABN , First Publish Date - 2022-01-20T03:10:27+05:30 IST
తన పార్టీ నాయకులకు తప్ప రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజలను రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ దగా చేస్తున్నాడని మాజీ ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ అరోపించారు
- కురుగొండ్ల
వెంకటగిరి, జనవరి 19: తన పార్టీ నాయకులకు తప్ప రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజలను రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ దగా చేస్తున్నాడని మాజీ ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ అరోపించారు. బుదవారం స్థానిక టీడీపీ కార్యాలయంలో విలేఖరుల సమావేశంలో మాట్లాడారు. రైతు ప్రభుత్వం అని ప్రచారం చేసుకొన్న అయన కనీసం యూరియా కూడా అందుబాటులో లేకుండా చేశాడన్నారు. గత టీడీపీ ప్రభుత్వం రైతులకు సబ్సిడీపై ఎరువులతోపాటు, అవసరమైన యంత్రాలు కూడా ఇచ్చిందన్నారు. పీఆర్సీ విషయంలో ఉద్యోగులకు తీరని ద్రోహం చేస్తున్నాడని ఆరోపించారు. పట్టణంలోని పాత బస్టాండ్లో ఆర్టీసీ బస్సులను నిలుపకపోవడంతో రూ. 10 ఉన్న ఆటో చార్టీలు ఒక్కసారిగా రూ. 25కు పెరిగిపోయాయని ఆందోళన వ్యక్తం చేశారు. వెంటనే బస్సులను పాతబస్టాండ్లో ఆపే విదంగా చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో నాయకులు పోలంరెడ్డి వెంకటరెడ్డి, బీరం రాజేశ్వరరావు, గెరిటి చెంచయ్యయాదవ్, మంకు ఆనందద్, గల్లా శ్రీనివాసులు, హేమంత్ చౌదరి, సుకుమార్ తదితతరులు పాల్గొన్నారు.