మహిళల భద్రత విషయంలో ఉపేక్షించ వద్దు: జగన్
ABN , First Publish Date - 2020-10-21T15:02:22+05:30 IST
విజయవాడ: ఇందిరాగాంధీ స్టేడియంలో పోలీస్ అమరవీరుల దినోత్సవం కార్యక్రమం జరిగింది.
విజయవాడ: ఇందిరాగాంధీ స్టేడియంలో పోలీస్ అమరవీరుల దినోత్సవం కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో సీఎం జగన్, మంత్రులు, పోలీస్ ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జగన్ పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. అమరవీరుల పుస్తకాన్ని జగన్ ఆవిష్కరించారు. ప్రతీ పోలీసు అమరవీరుడికి జేజేలు పలికారు. పౌరుల భద్రత, ముఖ్యంగా మహిళల భద్రత విషయంలో ఉపేక్షించ వద్దని జగన్ సూచించారు. కుల, మత ఘర్షణల్లో ఎలాంటి ఉపేక్ష లేకుండా పోలీసులు పనిచేయాలన్నారు. దిశ పీఎస్లు, ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర్లు, ప్రత్యేక కోర్టులు వస్తాయన్నారు. దిశ బిల్లును త్వరలోనే కేంద్రం ఆమోదిస్తుందని ఆశిస్తున్నానన్నారు. అదనపు సిబ్బంది కోసం డిసెంబర్లో నోటిఫికేషన్.. ఏడాదికి 6,500 పోస్టులు భర్తీ చేయాలని నిర్ణయించామని సీఎం జగన్ తెలిపారు.