జగన్ ఢిల్లీ పర్యటన వాయిదా
ABN , First Publish Date - 2021-03-04T00:43:51+05:30 IST
ఏపీ సీఎం జగన్ ఢిల్లీ పర్యటన వాయిదా పడింది. అయితే ఇంకా ప్రధాని మోదీ, కేంద్రమంత్రి అమిత్షా అపాయింట్మెంట్ ఖరారు కాలేదు.
అమరావతి: ఏపీ సీఎం జగన్ ఢిల్లీ పర్యటన వాయిదా పడింది. అయితే ఇంకా ప్రధాని మోదీ, కేంద్రమంత్రి అమిత్షా అపాయింట్మెంట్ ఖరారు కాలేదు. వచ్చే వారం జగన్ ఢిల్లీ వెల్లే అవకాశముందని పార్టీ వర్గాలు చెబుతున్నారు. గురువారం తిరుపతిలో దక్షిణాది రాష్ట్రాల ముఖ్యమంత్రుల సదస్సుకు అమిత్షా హాజరు కావాల్సి ఉంది. అక్కడే ఆయనను కలవొచ్చునని సీఎం భావించారు. అయితే అమిత్ పర్యటన రద్దుతో.. ఆయన అపాయింట్మెంట్ కోరుతూ లేఖ రాశారు. అనుమతి రాగానే ఢిల్లీకి వెళ్లాలని జగన్ భావిస్తున్నారని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.