జగన్ ఉద్యోగులకు శఠగోపం పెట్టారు: గోరంట్ల బుచ్చయ్య
ABN , First Publish Date - 2022-01-29T20:49:58+05:30 IST
అమలుకాని హామీలతో అధికారంలోకి వచ్చిన సీఎం జగన్.. ఉద్యోగులకు శఠగోపం పెట్టారని ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య ధ్వజమెత్తారు.
రాజమండ్రి: అమలుకాని హామీలతో అధికారంలోకి వచ్చిన సీఎం జగన్.. ఉద్యోగులకు శఠగోపం పెట్టారని ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య ధ్వజమెత్తారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ సీపీఎస్ ఎందుకు రద్దు చేయలేదో జగన్ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ఉద్యోగుల ఉద్యమాన్ని పక్కదోవ పట్టించేందుకు.. కొత్త జిల్లాల అంశాన్ని తెరపైకి తెచ్చారని గోరంట్ల బుచ్చయ్య దుయ్యబట్టారు.