కర్నూలులో అతిసారపై జగన్ దృష్టి: ఆళ్ల నాని

ABN , First Publish Date - 2021-04-08T20:43:56+05:30 IST

కర్నూలులో అతిసారపై సీఎం జగన్ దృష్టి పెట్టారని మంత్రి ఆళ్ల నాని తెలిపారు. వెంటనే కర్నూలుకి వెళ్లాలని ఆళ్లనానిని

కర్నూలులో అతిసారపై జగన్ దృష్టి: ఆళ్ల నాని

అమరావతి: కర్నూలులో అతిసారపై సీఎం జగన్ దృష్టి పెట్టారని మంత్రి ఆళ్ల నాని తెలిపారు. వెంటనే కర్నూలుకి వెళ్లాలని ఆళ్లనానిని సీఎం ఆదేశించారు. కర్నూలు జిల్లాలో పరిస్థితిపై సీఎం నివేదిక కోరారని, శుక్రవారం కర్నూలులో పర్యటించి సీఎంకు నివేదిక ఇస్తానని నాని పేర్కొన్నారు. కరోనా పరిస్థితిపై సీఎం జగన్‌ సమీక్ష నిర్వహించారని మంత్రి తెలిపారు. ఆస్పత్రుల సంసిద్ధతపై ఫోకస్‌ చేశామని, 104 కాల్ సెంటర్ మరింత బలోపేతం చేస్తామని చెప్పారు. వ్యాక్సినేషన్‌ను కూడా మరింత ముందుకు తీసుకెళ్లామని ఆళ్ల నాని ప్రకటించారు.

Updated Date - 2021-04-08T20:43:56+05:30 IST