జగన్ గారూ.. ఆపండి నాటకాలు: రఘురామ
ABN , First Publish Date - 2020-09-27T09:06:36+05:30 IST
జగన్మోహన్రెడ్డి గారూ.. ఆపండి ఈ నా టకాలు’’ అని వైసీపీ ఎంపీ రఘురామకృష్ణంరాజు వ్యాఖ్యానించారు...
న్యూఢిల్లీ, సెప్టెంబరు 26(ఆంధ్రజ్యోతి): ‘నన్ను సామాజికంగా వెలి వేశా రు. క్రైస్తవులు, సాటి ఎమ్మెల్యేలు, ఎంపీలతో వెలి వేయించారు. అయినా మేం బాగానే ఉంటున్నాం. నన్ను వెలి వేసినట్లు వాళ్లు నటిస్తున్నారు. వారిని న మ్మినట్లు మీరు నటిస్తున్నారు. జగన్మోహన్రెడ్డి గారూ.. ఆపండి ఈ నా టకాలు’’ అని వైసీపీ ఎంపీ రఘురామకృష్ణంరాజు వ్యాఖ్యానించారు. శనివారం ఢిల్లీలో మాట్లాడుతూ తనను పార్టీ నుంచి బహిష్కరించాలంటే జగన్కు భయమని చెప్పారు. ‘ఆయనతో మాట్లాడొద్దు. అన్నకు కోపం వస్తుంది.. అని సహచర ఎంపీలతో పార్లమెంటరీ పార్టీ నేత అంటున్నారు. అంత ఇష్టం లేన ప్పుడు నన్ను పార్టీ నుంచి పంపేయొచ్చు కదా? కానీ పంపాలంటే ఆయనకు భయం’ అని అన్నారు. ‘సీఎం కార్యాలయం, పార్టీ అధిష్ఠానం ఆదేశాల మేరకు భీమవరంలోని నా కార్యాలయంపై దళితులతో దాడి చేయించడానికి ప్రయ త్నాలు జరుగుతున్నాయి’ అని ఆరోపించారు.