జగన్ రాష్ట్రం గురించి ఆలోచించడం లేదు: శైలజానాథ్
ABN , First Publish Date - 2021-10-20T23:27:19+05:30 IST
సీఎం జగన్ రాష్ట్రం గురించి ఆలోచించడం లేదని ఏపీసీసీ చీఫ్ శైలజానాథ్ తప్పుబట్టారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ
విజయవాడ: సీఎం జగన్ రాష్ట్రం గురించి ఆలోచించడం లేదని ఏపీసీసీ చీఫ్ శైలజానాథ్ తప్పుబట్టారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రభుత్వం సరిగా పనిచేస్తే రాష్ట్రం ఇలా తయారయ్యేది కాదన్నారు. మంత్రులను జగన్ ఉత్సవ విగ్రహాలుగా మార్చారని ఎద్దేవాచేశారు. రాష్ట్రంలో ఏం జరిగినా ఒక మంత్రి మాత్రమే స్పందిస్తారని తెలిపారు. సీఎంని ఎవరేమన్నా టీడీపీకి పట్టిన గతే పడుతుందని ఓ ఎమ్మెల్యే హెచ్చరిస్తున్నారని, అంటే మీ తప్పులను ఎత్తి చూపకూడదా? కీర్తిస్తూ ఉండాలా? అని శైలజానాథ్ ప్రశ్నించారు. రాజకీయాల్లో ఆరోపణలు, విమర్శలు సహజమనే వాస్తవం జగన్ గుర్తించాలన్నారు. నిన్నటి దాడి ఘటనలో దోషులను చట్టపరంగా శిక్షించాలని శైలజానాథ్ డిమాండ్ చేశారు.