జగన్రెడ్డి గుర్తు పెట్టుకో..: లోకేష్
ABN , First Publish Date - 2021-03-31T22:05:02+05:30 IST
టీడీపీ నేత కృష్ణారావు హత్య సీఎం జగన్ అరాచకపాలనకు నిదర్శనమని టీడీపీ నేత నారా లోకేష్ అన్నారు.
అమరావతి: టీడీపీ నేత కృష్ణారావు హత్య సీఎం జగన్ అరాచకపాలనకు నిదర్శనమని టీడీపీ నేత నారా లోకేష్ అన్నారు. గుంటూరు జిల్లా లక్కరాజుగార్లపాడులో ఇటీవల కృష్ణారావు వైసీపీ నేతల దాడిలో మరణించారు. ఈ నేపథ్యంలోనే కృష్ణారావు కుటుంబసభ్యులను లోకేస్ పరామర్శించారు. అనంతరం లోకేష్ మీడియాతో మాట్లాడుతూ ప్రభుత్వంపై మండిపడ్డారు. అరాచకాలలో బిహార్తో ఏపీ పోటీ పడుతోందన్నారు. జగన్రెడ్డి గుర్తు పెట్టుకో.. రేపు అధికారంలోకి వచ్చేది టీడీపేనని హెచ్చరించారు. వడ్డీతో సహా చెల్లిస్తామని చెప్పారు. పోలీసులు లేకుండా జగన్ ప్రజల్లోకి రావొద్దు తరిమి కొడతారని, మహిళా హోంమంత్రి ఉన్నా మహిళలకు రక్షణ లేదని లోకేష్ అన్నారు.