ఓడిపోతామని తెలిసే జగన్‌ ప్రచారానికి రాలేదు: పరిటాల శ్రీరాం

ABN , First Publish Date - 2021-04-11T01:05:00+05:30 IST

తిరుపతిలో టీడీపీ నేత పరిటాల శ్రీరాం ఎన్నికల ప్రచారం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీఎం జగన్‌పై మండిపడ్డారు.

ఓడిపోతామని తెలిసే జగన్‌ ప్రచారానికి రాలేదు: పరిటాల శ్రీరాం

తిరుపతి: తిరుపతిలో టీడీపీ నేత పరిటాల శ్రీరాం ఎన్నికల ప్రచారం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీఎం జగన్‌పై మండిపడ్డారు. ఓడిపోతామని తెలిసే జగన్‌ ప్రచారానికి రాలేదని ఎద్దేవాచేశారు. టీడీపీ నేతలు చంద్రబాబు, లోకేశ్ పర్యటనలకు అద్భుతమైన స్పందన వస్తోందని చెప్పారు. వైసీపీ ప్రభుత్వాన్ని కాలరాయాలని ప్రజలు నిర్ణయించుకున్నారని, టీడీపీకి మద్దతు తెలిపేందుకు సిద్ధంగా ఉన్నారని పరిటాల శ్రీరాం స్పష్టం చేశారు. 


తిరుపతి లోక్‌సభ నియోజకవర్గ ఉప ఎన్నికల నేపధ్యంలో ప్రధాన రాజకీయ పక్షాలకు చెందిన ముఖ్య నేతల ప్రచార పర్యటనలతో తిరుపతి నగరం హోరెత్తుతోంది. ఈ నెల 17 పోలింగ్‌ జరగనుండడం,15వ తేదీనే ప్రచారం ముగియనుండడంతో ఇపుడిపుడే ఆయా పార్టీలకు చెందిన వీఐపీల రాక కూడా పెరుగుతోంది. ఉప ఎన్నికలకు గత నెల 23న ఎన్నికల నోటిఫికేషన్‌ వెలువడిన నేపధ్యంలో ప్రారంభంలోనే తిరుపతి నగరంలో టీడీపీ అభ్యర్థి పనబాక లక్ష్మితో కలసి టీడీపీ ముఖ్య నేతలు ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్నారు.

Updated Date - 2021-04-11T01:05:00+05:30 IST