వైఎస్‌కు నివాళులర్పించిన సీఎం జగన్, కుటుంబసభ్యులు

ABN , First Publish Date - 2020-07-08T19:13:32+05:30 IST

వైఎస్ రాజశేఖర్ రెడ్డి జయంతి సందర్భంగా కుటుంబసభ్యులు నివాళులర్పించారు.

వైఎస్‌కు నివాళులర్పించిన సీఎం జగన్, కుటుంబసభ్యులు

కడప: వైఎస్ రాజశేఖర్ రెడ్డి జయంతి సందర్భంగా కుటుంబసభ్యులు నివాళులర్పించారు. ఇడుపులపాయలోని వైఎస్సార్ ఘాట్ వద్ద సీఎం జగన్, విజయలక్ష్మి, షర్మిల, ఇతర కుటుంబసభ్యులు దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డికి నివాళులర్పించారు. ఇడుపులపాయలో వైఎస్సార్ సమాధి వద్ద ప్రత్యేక ప్రార్థనలు చేశారు. వైఎస్ జయంతి సందర్భంగా వైఎస్ విజయలక్ష్మి రాసిన ‘నాలో నాతో వైఎస్సార్’ అనే పుస్తకాన్ని జగన్ ఆవిష్కరించనున్నారు. 


ఆ తర్వాత ట్రిపుల్ ఐటీలో అభివృద్ధి, శంకుస్థాపన కార్యక్రమాల్లో సీఎం పాల్గొననున్నారు. ట్రిపుల్ ఐటీ క్యాంపస్ మధ్యలో వైఎస్ విగ్రహాన్ని ముఖ్యమంత్రి ఆవిష్కరించనున్నారు. రూ. 139 కోట్లతో నిర్మించిన ఏడు డిపార్టుమెంట్ కాంప్లెక్స్‌లను, మూడు మెగావాట్ల సోలార్ పవర్ సిష్టమ్, రూ. 40 కోట్లతో నిర్మించిన వైఎస్సార్ ఆడిటోరియంను, రూ. 11 కోట్లతో ఏర్పాటు చేసిన కంప్యూటర్ ల్యాబ్‌ను సీఎం జగన్ ప్రారంభించనున్నారు.

Updated Date - 2020-07-08T19:13:32+05:30 IST