సీఎం జగన్‌కు ఎంపీ రఘురామకృష్ణంరాజు లేఖ

ABN , First Publish Date - 2020-07-14T20:08:40+05:30 IST

సీఎం జగన్‌కు ఎంపీ రఘురామకృష్ణంరాజు లేఖ రాశారు. భవన నిర్మాణ కార్మికులను ఆదుకోవాలన్నారు.

సీఎం జగన్‌కు ఎంపీ  రఘురామకృష్ణంరాజు లేఖ

పశ్చిమగోదావరి: సీఎం జగన్‌కు ఎంపీ  రఘురామకృష్ణంరాజు లేఖ రాశారు. భవన నిర్మాణ కార్మికులను ఆదుకోవాలన్నారు. రాష్ట్రంలో 20 లక్షల 64 వేల భవన నిర్మాణ కార్మికులు తమ పేర్లు నమోదు చేయించుకున్నారు, వారిలో 10లక్షల 66 వేల మంది కార్మికుల పేర్లను మాత్రమే ఆధార్‌తో లింక్ చేశారని లేఖలో పేర్కొన్నారు. మిగిలిన వారి పేర్లు వెంటనే లింక్ చేసేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. రాష్ట్ర ప్రభుత్వం 2014 నుంచి 2019 మధ్య కాలంలో బిల్డర్స్ నుంచి సంక్షేమ నిధి రూపేణా 13 వందల 64 కోట్లు వసూలు చేసిందన్నారు. ఇప్పటి వరకు 330 కోట్లు మాత్రమే ఖర్చు చేసారని చెప్పారు. మిగిలిన వెయ్యి కోట్ల నిధుల నుంచి ఒక్కో భవన నిర్మాణ కార్మికుడికి 5 వేల రూపాయల చొప్పున ఆర్ధిక సహాయం అందించాలని లేఖ ద్వారా కోరారు. 

Updated Date - 2020-07-14T20:08:40+05:30 IST