పేదలకు ఇళ్ల నిర్మాణంపై జగన్ సమీక్ష

ABN , First Publish Date - 2021-08-23T19:38:00+05:30 IST

రాష్ట్రంలో పేదలకు ఇళ్ల నిర్మాణంపై సీఎం జగన్ సమీక్ష నిర్వహించారు. వైఎస్సార్ జగనన్న కాలనీలు, టిడ్కో ఇళ్లు, ఎంఐజీ లే అవుట్లపై సమీక్ష నిర్వహించారు.

పేదలకు ఇళ్ల నిర్మాణంపై జగన్ సమీక్ష

అమరావతి: రాష్ట్రంలో పేదలకు ఇళ్ల నిర్మాణంపై సీఎం జగన్ సమీక్ష నిర్వహించారు. వైఎస్సార్ జగనన్న కాలనీలు, టిడ్కో ఇళ్లు, ఎంఐజీ లే అవుట్లపై సమీక్ష నిర్వహించారు. అక్టోబర్ 25 నుంచి ఇళ్ల నిర్మాణం ప్రారంభం కావాలని సీఎం ఆదేశించారు. ఫేజ్‌-1లో భాగంగా 85,888 ఇళ్ల పనులు పూర్తి చేశామని సీఎంకు అధికారులు వివరించారు. మౌలిక వసతుల పనులు కొనసాగుతున్నాయని అధికారులు తెలిపారు. డిసెంబర్ 2021 నాటికల్లా లబ్దిదారులకు ఇళ్లు అందిస్తామన్నామని అధికారులు చెప్పారు. విజయదశమి నాటికి అమలు తేదీలు ప్రకటించాలని జగన్ ఆదేశించారు.

Updated Date - 2021-08-23T19:38:00+05:30 IST