జగన్ స్పందించాలి: ఎమ్మెల్సీ మాధవ్
ABN , First Publish Date - 2020-09-19T10:17:01+05:30 IST
ప్రజాస్వామ్యం, లౌకికతత్వం అమలుపై సీఎం జగన్కు చిత్తశుద్ధి ఉంటే హిందూ దేవాలయాలపై జరుగుతున్న దాడులపై స్పందిం చాలని బీజేపీ రాష్ట్ర ప్రధాన
కోటనందూరు : ప్రజాస్వామ్యం, లౌకికతత్వం అమలుపై సీఎం జగన్కు చిత్తశుద్ధి ఉంటే హిందూ దేవాలయాలపై జరుగుతున్న దాడులపై స్పందిం చాలని బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్సీ పీవీఎన్ మాధవ్ డిమాండ్ చేశారు. కోటనందూరులో విలేకర్లతో ఆయన మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు జరుగుతున్నా జగన్ మాట్లాడకపోవడం తన మతాన్ని ప్రోత్సహిస్తున్నట్టుగా ప్రజలు భావించాల్సి వస్తుందన్నారు. రాష్ట్రంలో 15 దేవాలయాలపై దాడులు జరిగాయన్నారు. ఇందుకు వ్యతిరేకంగా ధర్నా చేసిన వారిపై ఆరు సెక్షన్లతో కేసులు పెట్టారని, వాటిని ఎత్తివేయాలని డిమాండ్ చేశారు.