ముఖ్యమంత్రిగా జగన్ సక్సెస్ : ఎమ్మెల్యే
ABN , First Publish Date - 2020-05-30T11:28:50+05:30 IST
రాష్ట్ర ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్ సక్సెస్ అయ్యారని రైల్వేకోడూరు ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ కొరముట్ల
రైల్వేకోడూరు రూరల్, మే, 29: రాష్ట్ర ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్ సక్సెస్ అయ్యారని రైల్వేకోడూరు ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ కొరముట్ల శ్రీనివాసులు అన్నారు. శుక్రవారం వైసీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ హామీలన్నీ నెరవేర్చిన ఘనత జగన్కే దక్కిందన్నారు. రైల్వేకోడూరు నియోజకవర్గం లో ఇప్పటి వరకు రూ.300 కోట్లుతో అభివృద్ధి పనులు సాగుతున్నాయని తెలిపారు.
వైసీపీ విజయోత్సవ సంబరాలు
వైసీపీ ప్రభుత్వం ఏర్పడి ఏడాది పూర్తి అయిన సందర్భంగా శుక్రవారం రాత్రి స్థానిక టోల్గేట్ వద్ద ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ కొరముట్ల శ్రీనివాసులు ఆధ్వర్యంలో భారీ ఎత్తున బాణాసంచా కాల్చారు.