భవన కార్మికులను రోడ్డున పడేసిన జగన్: పట్టాభి
ABN , First Publish Date - 2021-01-17T19:48:48+05:30 IST
జగన్ తన అవినీతి మురికి కంపెనీ భారతి సిమెంట్స్ కోసం.. లక్షలాది మంది భవన కార్మికులను రోడ్డున పడేశాడని ..
అమరావతి: జగన్ తన అవినీతి మురికి కంపెనీ భారతి సిమెంట్స్ కోసం.. లక్షలాది మంది భవన కార్మికులను రోడ్డున పడేశాడని టీడీపీ జాతీయ అధికారప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్ ఆరోపించారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. భారతి సిమెంట్స్కు వందల కోట్లు దోచి పెట్టడానికే.. సిమెంట్ వ్యవస్థను సిండికేట్ చేశారని మండిపడ్డారు. పేదల ఇంటి కలను సిమెంట్ ధరల పెంపుతో ఛిద్రం చేశారన్నారు. 2010లో భారతి సిమెంట్స్లో 51 శాతం వాటాను.. వైక్యాట్ అనే ఫ్రెంచ్ సంస్థ కొనుగోలు చేసిందన్నారు. సిమెంట్ ధరలపై కేబినెట్ సబ్ కమిటీ ఎందుకు వేయడం లేదని ప్రశ్నించారు. ఇండియా సిమెంట్స్ అధినేత శ్రీనివాసన్తో కలిసి.. జగన్ సిమెంట్ ధరలు పెంచాడని పట్టాభిరామ్ మండిపడ్డారు.