ఢిల్లీకి జగన్‌!

ABN , First Publish Date - 2021-03-03T07:28:55+05:30 IST

ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి మరోదఫా ఢిల్లీకి వెళుతున్నారు. బుధవారం లేక గురువారం ఆయన కేంద్ర హోం మంత్రి అమిత్‌షాను కలుస్తారని చర్చ జరుగుతోంది

ఢిల్లీకి జగన్‌!

అమరావతి, నూఢిల్లీ, మార్చి 2 (ఆంధ్రజ్యోతి): ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి మరోదఫా ఢిల్లీకి వెళుతున్నారు. బుధవారం లేక గురువారం ఆయన కేంద్ర హోం మంత్రి అమిత్‌షాను కలుస్తారని చర్చ జరుగుతోంది. అవకాశమిస్తే ప్రధాని మోదీని కూడా కలిసి వస్తారని ప్రభుత్వ వర్గాలు అంటున్నాయి. గురువారం తిరుపతిలో దక్షిణాది రాష్ట్రాల ముఖ్యమంత్రుల సదస్సుకు అమిత్‌షా హాజరు కావాల్సి ఉంది. అక్కడే ఆయనను కలవొచ్చునని సీఎం భావించారు. అయితే అమిత్‌ పర్యటన రద్దుతో.. ఆయన అపాయింట్‌మెంట్‌ కోరుతూ లేఖ రాశారు. అనుమతి రాగానే ఢిల్లీకి వెళ్లాలని జగన్‌ భావిస్తున్నారని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.

Updated Date - 2021-03-03T07:28:55+05:30 IST