సచ్చిదానంద స్వామి ఆశ్రమానికి సీఎం జగన్
ABN , First Publish Date - 2021-10-18T16:43:46+05:30 IST
ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి శ్రీ గణపతి సచ్చిదానంద స్వామి ఆశ్రమానికి వచ్చారు.
విజయవాడ: ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సోమవారం విజయవాడ పటమటలోని శ్రీ గణపతి సచ్చిదానంద స్వామి ఆశ్రమానికి వచ్చారు. అక్కడ ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. దీంతో అక్కడ అధికారులు ఏర్పాట్లు చేశారు. అనంతరం సీఎం జగన్ సచ్చిదానంద స్వామితో సమావేశమవుతారు. ముఖ్యమంత్రి పర్యటన నేపథ్యంలో విజయవాడ నగరంలో ట్రాఫిక్ను మళ్లించారు.