వైసీపీలో మొదలైన తిరుగుబాటు..కరప్షన్‌పై ఓపెన్‌గా నేతల సవాళ్లు

ABN , First Publish Date - 2021-10-18T23:23:56+05:30 IST

వైసీపీలో నేతల మధ్య ఘర్షణలు, పరస్పర ఆరోపణలు, నాయకుల మధ్య ఆదిపత్య పోరు వంటివి చాలా సందర్భాల్లో చూశాం. కానీ నేరుగా...

వైసీపీలో మొదలైన తిరుగుబాటు..కరప్షన్‌పై ఓపెన్‌గా నేతల సవాళ్లు

అమరావతి/హైదరాబాద్: వైసీపీలో నేతల మధ్య ఘర్షణలు, పరస్పర ఆరోపణలు, నాయకుల మధ్య ఆదిపత్య పోరు వంటివి చాలా సందర్భాల్లో చూశాం. కానీ నేరుగా ప్రెస్‌మీట్‌లు పెట్టి వైసీపీ నాయకులు ఒకరిపై ఒకరు అవినీతిపరులంటూ ఆరోపణలు చేసుకుంటున్నారు. ఇప్పటివరకూ అంతర్గతంగా మాట్లాడుకున్న వైసీపీ నాయకులు ఇప్పుడు వాళ్లకు వాళ్లే ఓపెన్‌గా విమర్శలు చేసుకునే పరిస్థితికి వచ్చారు. 


తాజాగా నెల్లూరు జిల్లా ఉదయగిరి ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి అక్రమాలపై సొంత పార్టీ నేతలు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ప్రతి చిన్నపనికి ఓ రేటు కట్టి పెద్ద ఎత్తున అక్రమాలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. అంగన్‌వాడి పోస్టులు, పార్టీ పదవులకు రేట్లు కట్టి అమ్మకాలు సాగిస్తున్నారని విమర్శించారు. జగనన్న ఆశయాలకు తూట్లు పొడుస్తూ అవినీతికి పాల్పడుతున్నారని ఆరోపించారు.


అనంతపురం: పెనుగొండ వైసీపీలో పందికొక్కుల బ్యాచ్ ఎక్కువైందని మంత్రి శంకర్ నారాయణ వ్యాఖ్యానించారు. అడ్డదారుల్లో డబ్బులు సంపాదన కోసం ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. టీడీపీ మాజీ ఎమ్మెల్యే పార్థసారధి అండతోనే వైసీపీలోని పందికొక్కుల బ్యాచ్ రెచ్చిపోతోందని మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే మంత్రి వ్యాఖ్యలకు గోరంట్ల మండలానికి చెందిన వైసీపీ నేత రమణారెడ్డి కౌంటరిచ్చారు. ఎవరు పందికొక్కులో అందరికీ తెలుసునన్నారు. దేవుడిపై ప్రమాణం చేయడానికి ముందుకు రావాలని ఆయన సవాల్ విసిరారు.


వైసీపీలో ఇలాంటి పరిణామాలు చేసుకున్న నేపథ్యంలో ‘‘పెరిగిన అధికార పార్టీ నేతల అరాచకాలు. ఎదురు తిరుగుతోన్న సొంత పార్టీ నేతలు. అన్నీ చోట్ల అమ్యామ్యాలు. ఊళ్లకు ఊళ్లు మింగుతోన్న నేతలు. Y C- కరప్షన్ P-పార్టీ’’ అనే అంశాలపై ఏబీఎన్ ఆంధ్రజ్యోతి చర్చా కార్యక్రమం నిర్వహించింది. ఈ వీడియోను చూడగలరు. 



Updated Date - 2021-10-18T23:23:56+05:30 IST