ప్రజలకు చుక్కలు చూపిస్తున్న జగనన్న పథకాలు

ABN , First Publish Date - 2021-06-10T21:02:31+05:30 IST

జగనన్న ప్రభుత్వ పథకాలు ప్రజలకు చుక్కలు చూపిస్తున్నాయి.

ప్రజలకు చుక్కలు చూపిస్తున్న జగనన్న పథకాలు

విశాఖ: జగనన్న ప్రభుత్వ పథకాలు ప్రజలకు చుక్కలు చూపిస్తున్నాయి. ప్రభుత్వ పథకాలు అందాలంటే ఆధార్ కార్డులో మొబైల్ నెంబర్, పేర్లు, పుట్టినతేది సరిచేసుకోవాలంటూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. దీంతో విశాఖలో ఆధార్ సెంటర్ దగ్గరకు జనాలు బారులుతీరారు. గత మూడు రోజులుగా ఇదే పరిస్థితి కనిపిస్తోంది. కరోనా సెకండ్ వేవ్ తీవ్రంగా ఉన్న నేపథ్యంలో ఇక్కడ ఎవరూ సామాజిక దూరం పాటించడంలేదు. ఒక వైపు కరోనా భయం, మరో వైపు పథకాలు ఎక్కడ రాకుండపోతాయోనన్న భయం వారిలో వెంటాడుతోంది. క్యూ లైన్లలో వృద్ధులు, మహిళలు ఎక్కువగా ఉన్నారు. అయితే ఇదివరకటిలా మీసేవ సెంటర్లకు ఇస్తే బాగుండునని  చాలా మంది అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

Updated Date - 2021-06-10T21:02:31+05:30 IST