డెలిగేట్స్‌ బృందంలో జగన్మోహన్‌

ABN , First Publish Date - 2021-06-23T09:33:43+05:30 IST

టోక్యో ఒలింపిక్స్‌కు వెళ్లే భారత ప్రతినిధుల బృందంలో తెలుగు రాష్ట్రాల నుంచి జాతీయ హ్యాండ్‌బాల్‌ సమాఖ్య అధ్యక్షుడు ఎ.జగన్మోహన్‌రావుకు అవకాశం దక్కింది.

డెలిగేట్స్‌ బృందంలో జగన్మోహన్‌

హైదరాబాద్‌ (ఆంధ్రజ్యోతి క్రీడాప్రతినిధి): టోక్యో ఒలింపిక్స్‌కు వెళ్లే భారత ప్రతినిధుల బృందంలో తెలుగు రాష్ట్రాల నుంచి జాతీయ హ్యాండ్‌బాల్‌ సమాఖ్య అధ్యక్షుడు ఎ.జగన్మోహన్‌రావుకు అవకాశం దక్కింది. తెలుగు రాష్ట్రాల నుంచి ఇప్పటివరకు టోక్యో ఒలింపిక్స్‌కు వెళ్తున్న ఏకైక వ్యక్తి జగన్మోహన్‌నే కావడం విశేషం. ఐఓఏ డెలిగేట్స్‌ బృందంలో జగన్‌కు చోటు కల్పించడం పట్ల తెలుగు రాష్ట్రాల క్రీడా సంఘాల ప్రతినిధులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. 

Updated Date - 2021-06-23T09:33:43+05:30 IST