జగనన్న టౌన్షిప్ ఇళ్ల దరఖాస్తు గడువు పొడిగింపు
ABN , First Publish Date - 2021-04-14T06:13:01+05:30 IST
మధ్యతరగతి ఆదాయ వర్గాల వారికి సొంతింటి కల నెరవేర్చే లక్ష్యంతో ప్రభుత్వం చేపట్టిన ఇళ్ల దరఖాస్తుల గడువు 20వ తేదీ వరకు పొడిగించినట్లు మునిసిపల్ కమిషనర్ సంపత్కుమార్ మంగళవారం తెలిపారు.
గుడివాడ టౌన్ : మధ్యతరగతి ఆదాయ వర్గాల వారికి సొంతింటి కల నెరవేర్చే లక్ష్యంతో ప్రభుత్వం చేపట్టిన ఇళ్ల దరఖాస్తుల గడువు 20వ తేదీ వరకు పొడిగించినట్లు మునిసిపల్ కమిషనర్ సంపత్కుమార్ మంగళవారం తెలిపారు. 150, 200, 240 చదరపు గజాల విస్తీర్ణంలో అన్ని మౌలిక సదుపాయాలతో జగనన్న టౌన్షిప్ను అభివృద్ధి చేస్తున్నట్లు చెప్పారు. ప్రజల నుంచి స్పందన ఉన్నందున గడువు పొడిగించామన్నారు. ఇప్పటి వరకు 150 చదరపు గజాలకు 535 మంది, 200 చదరపు గజాల స్థలానికి 847 మంది, 240 చదరపు గజాల స్థలానికి 1014 మంది మొత్తం 2,396 మంది దరఖాస్తు చేసుకున్నారని కమీషనర్ తెలిపారు.