శ్రీవారి సన్నిధిలో జగన్రెడ్డి నామ స్మరణా?: పుట్టా
ABN , First Publish Date - 2021-10-15T06:51:32+05:30 IST
తిరుమల కొండపై గోవింద నామ స్మరణ తప్ప మరొకటి వినిపించకూడదు. టీటీడీ చైర్మన్ సతీమణి స్వయంగా శ్రీవారి ఆలయంలో గోవింద నామాలకు బదులు ముఖ్యమంత్రి
‘‘తిరుమల కొండపై గోవింద నామ స్మరణ తప్ప మరొకటి వినిపించకూడదు. టీటీడీ చైర్మన్ సతీమణి స్వయంగా శ్రీవారి ఆలయంలో గోవింద నామాలకు బదులు ముఖ్యమంత్రి జగన్రెడ్డి నామస్మరణ చేయడం దారుణాతిదారుణం. భక్తుల మనోభావాలను దెబ్బ తీసినందుకు టీటీడీ చైర్మన్ సుబ్బారెడ్డి బహిరంగ క్షమాపణ చెప్పి తన పదవికి రాజీనామా చేయాలి’’ అని టీటీడీ మాజీ చైర్మన్ పుట్టా సుధాకర్ యాదవ్ డిమాండ్ చేశారు.