మెత్తబడ్డ జగ్గారెడ్డి
ABN , First Publish Date - 2021-11-03T21:37:24+05:30 IST
కాంగ్రెస్లో వివాదం ముగిసింది. మంగళవారం హుజురాబాద్ ఎన్నికల ఫలితాలపై టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి, సీఎల్పీ నేత భట్టి
హైదరాబాద్: కాంగ్రెస్లో వివాదం ముగిసింది. మంగళవారం హుజురాబాద్ ఎన్నికల ఫలితాలపై టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి, సీఎల్పీ నేత భట్టి విక్రమార్కలను ఎమ్మెల్యే జగ్గారెడ్డి టార్గెట్ చేశారు. పొలిటికల్ ఎఫైర్స్ కమిటీ సమావేశంలో నిలదీస్తానని మండిపడ్డారు. అయితే పొలిటికల్ ఎఫైర్స్ సమావేశంలో జగ్గారెడ్డి మెత్తబడ్డారు. తాను మాట్లాడిన మాటలను వదిలేయాలని, సమావేశంలో అందరికీ జగ్గారెడ్డి విజ్ఞప్తి చేశారు. ఉన్నది ఉన్నట్లు మాట్లాడటం తన బలహీనత అని, ఇకపై ఇలాంటి మాటలు మాట్లాడనని జగ్గారెడ్డి హామీ ఇచ్చారు. ఇకపై నియోజకవర్గంలో ఎలా గెలవాలో చూసుకుంటానని, ఎలాంటి వివాదాలకు వెళ్లనని జగ్గారెడ్డి అన్నారు.