Telangana: తాతను బండరాయితో మోది చంపిన మనుమడు

ABN , First Publish Date - 2022-01-18T14:49:43+05:30 IST

జిల్లాలోని మేడిపల్లి మండలం కల్వకోట గ్రామంలో దారుణం చోటు చేసుకుంది.

Telangana: తాతను బండరాయితో మోది చంపిన మనుమడు

జగిత్యాల: జిల్లాలోని మేడిపల్లి మండలం కల్వకోట గ్రామంలో దారుణం చోటు చేసుకుంది. తాత ఆది మల్లయ్యను మనువడు చందు బండ రాయితో కొట్టి చంపాడు. గ్రామపంచాయితీ ఎదుట ఈ ఘటన జరిగింది. బండరాయితో కొడుతుండగా కనీసం అడ్డుకునేందుకు కూడా గ్రామస్థులు సాహసింహచని పరిస్థితి. దీంతో అందరూ  చూస్తుండగా ఆది మల్లయ్య తుదిశ్వాస విడిచారు. దాడి దృశ్యాలు అక్కడి సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి. దాడి అనంతరం  నిందితుడు మృతదేహాన్ని బైక్‌పై తీసుకెళ్లాడు. ప్రస్తుతం నిందితుడు చందు మేడిపల్లి పోలీసుల అదుపులో ఉన్నాడు. కాగా కొద్ది రోజులుగా నిందితుడు చందు మతిస్థిమితం సరిగ్గా లేదని తెలుస్తోంది. దాడి ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. 

Updated Date - 2022-01-18T14:49:43+05:30 IST