చెట్టును కొట్టేశారని నిరసన.. జరిమానా వేసిన అధికారులు

ABN , First Publish Date - 2021-08-30T23:14:22+05:30 IST

చెట్టును కొట్టేశారని నిరసన.. జరిమానా వేసిన అధికారులు

చెట్టును కొట్టేశారని నిరసన.. జరిమానా వేసిన అధికారులు

జగిత్యాల: తాను నాటిన చెట్టును కొట్టేశారని, జగిత్యాలలో ఓ వ్యక్తి నిరసనకు దిగారు. చెట్టును కొట్టేసిన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. జగిత్యాలలోని ఎల్జీరామ్ లాడ్జ్ వద్ద నివశించే ప్రభాకర్ ఈ నిరసన చేపట్టారు. తనకు రావాల్సిన ఆస్తిని సోదరుడు ఇవ్వడంలేదని, తాను నాటిన చెట్టును కూడా కొట్టేశారని ఆవేదన వ్యక్తం చేశారు. ఓవైపు  చెట్టు నాటాలని ప్రభుత్వం చెబుతుంటే మరోవైపు చెట్లను కొట్టేస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. దీనిపై స్పందించిన మున్సిపల్ అధికారులు చెట్టును కొట్టిన వ్యక్తికి రూ. 5 వేలు జరిమానా విధించారు. 



Updated Date - 2021-08-30T23:14:22+05:30 IST