నేడు జై భీమ్‌ సమర భేరి

ABN , First Publish Date - 2021-04-14T06:11:42+05:30 IST

జై భీమ్‌ యాక్సెస్‌ జస్టిస్‌ వ్యవస్థాపకుడు జె.శ్రావణ్‌కుమార్‌ నేతృత్వంలో అంబేద్కర్‌ జయంతి సందర్భంగా జై భీమ్‌ సమర భేరి కార్యక్రమంను నిర్వహిస్తున్నట్లు జిల్లా కోర్‌ కమిటీ సభ్యురాలు సుజాత వెల్లడించారు.

నేడు జై భీమ్‌ సమర భేరి
జై భీమ్‌ సమర భేరి గోడపత్రిక విడుదల చేస్తున్న జైభీమ్‌ యాక్సెస్‌ సభ్యులు

గుంటూరు (సంగడిగుంట), ఏప్రిల్‌13: జై భీమ్‌ యాక్సెస్‌ జస్టిస్‌ వ్యవస్థాపకుడు జె.శ్రావణ్‌కుమార్‌ నేతృత్వంలో అంబేద్కర్‌ జయంతి సందర్భంగా జై భీమ్‌ సమర భేరి కార్యక్రమంను నిర్వహిస్తున్నట్లు జిల్లా కోర్‌ కమిటీ సభ్యురాలు సుజాత వెల్లడించారు. మంగళవారం నల్లపాడులో పోస్టర్లను విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కొవిడ్‌ నిబంధనలను అనుగుణంగానే డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌ జయంతిని జరుపుతున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో ఏసురత్నం, కుమార్‌, వెంకటేశ్వర్లు, ప్రసాద్‌ తదితరులు పాల్గొన్నారు. 


Updated Date - 2021-04-14T06:11:42+05:30 IST