తాగి లారీ నడిపిన వ్యక్తికి జైలు
ABN , First Publish Date - 2021-03-03T05:47:54+05:30 IST
తాగి లారీ నడిపిన వ్యక్తికి జైలు
యాచారం: మద్యం తాగి లారీ నడిపిన డ్రైవర్కు ఇబ్రహీంపట్నం కోర్టు రెండు రోజుల జైలు శిక్షతో పాటు రూ.2వేల జరిమానా విధించింది. మూడు రోజుల క్రి తం లారీ స్ర్కాప్ లోడ్తో హైదరాబాద్ వెళ్తోంది. లారీ నడుపుతున్న తీరుపై అనుమానం వచ్చిన పోలీసులు లారీని అపి డ్రైవర్ కిషన్నాయక్(40)కు డ్రంకెన్ డ్రైవ్ పరీక్ష నిర్వహించారు. అతడు మద్యం తాగినట్టు తేలడంతో కోర్టులో హాజరుపర్చారు. మంగళవారం మెట్రోపాలిటన్ స్పెషల్ కోర్టు జడ్జి కిషన్నాయక్కు రెండు రో జుల జైలు శిక్ష, రూ.2వేల జరిమానా విధించారని సీఐ లింగయ్య తెలిపారు.