కశ్మీర్లో భారీ ఉగ్రదాడికి కుట్ర
ABN , First Publish Date - 2020-11-22T10:04:37+05:30 IST
జమ్ము నగరంలోని నగ్రోటా ప్రాంతంలో గురువారం హతమైన నలుగురు జైషే మొహమ్మద్ ఉగ్రవాదులు కశ్మీర్లో భారీ
ముష్కరుల జీపీఎస్ ద్వారా వెల్లడి
న్యూఢిల్లీ/జమ్ము, నవంబరు 21: జమ్ము నగరంలోని నగ్రోటా ప్రాంతంలో గురువారం హతమైన నలుగురు జైషే మొహమ్మద్ ఉగ్రవాదులు కశ్మీర్లో భారీ ఉగ్రదాడికి కుట్రపన్నారు. లోయలో బీభత్సం సృష్టించడానికి జైషే కమాండర్లు ముఫ్తీ రౌఫ్ అస్ఘర్, ఖారీ జరార్తో ఆ ముష్కరులు ఎప్పటికపుడు సంప్రదింపులు జరిపారని అధికారులు తెలిపారు. అంతర్జాతీయ ఉగ్రవాదిగా ఐక్యరాజ్య సమితి ప్రకటించిన జైషే చీఫ్ మసూద్ అజహర్ తమ్ముడే రౌఫ్ అస్ఘర్ అన్నారు. త్వరలో జరిగే జిల్లా అభివృద్ధి మండళ్ల(డీడీసీ) ఎన్నికల్లోనూ నరమేధం సృష్టించేందుకు అస్ఘర్ నుంచి ఆ ఉగ్రవాదులకు ఆదేశా లు అందినట్లు వారి జీపీఎస్(గ్లోబల్ పొసిషనింగ్ సిస్ట మ్) పరికరాలను విశ్లేషించాక తేలిందని వివరించారు.
పాక్ కాల్పుల్లో భారత జవాను వీరమరణం
కశ్మీర్లోని నియంత్రణ రేఖ వెంబడి పోస్టులు, గ్రామాలపై శుక్రవారం అర్ధరాత్రి పాకిస్థాన్ కాల్పులు జరపడంతో భారత జవాను వీరమరణం పొందారు. అమరుడైన జవాన్ను మహారాష్ట్రకు చెందిన హవల్దార్ పాటిల్ సంగ్రామ్ శివాజీగా గుర్తించారు.