Friend దగ్గర నోట్స్ తీసుకోవాలన్న కూతురు.. ఆ NRI దంపతులు సరే అనడంతో జరిగిన ఘోరమిదీ..!

ABN , First Publish Date - 2021-09-04T19:09:57+05:30 IST

ఫ్రెండ్ దగ్గర నోట్స్ తీసుకోవాలని వెళ్లిన 14 ఏళ్ల బాలిక తిరిగి ఇంటికి రాని ఘటన పంజాబ్‌లోని జలంధర్‌లో చోటు చేసుకుంది. ఆగస్టు 29న జలంధర్ నగరంలో ఉండే ఓ ఎన్నారై దంపతుల కూతురు ఇలా ఇంటి నుంచి బయటకు వెళ్లి కనిపించకుండా పోయింది.

Friend దగ్గర నోట్స్ తీసుకోవాలన్న కూతురు.. ఆ NRI దంపతులు సరే అనడంతో జరిగిన ఘోరమిదీ..!

జలంధర్: ఫ్రెండ్ దగ్గర నోట్స్ తీసుకోవాలని వెళ్లిన 14 ఏళ్ల బాలిక తిరిగి ఇంటికి రాని ఘటన పంజాబ్‌లోని జలంధర్‌లో చోటు చేసుకుంది. జలంధర్ నగరంలో ఉండే ఓ ఎన్నారై దంపతుల కూతురు ఇలా ఇంటి నుంచి బయటకు వెళ్లి కనిపించకుండా పోయింది. బాలిక తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు మిస్సింగ్ కేసు నమోదు చేసుకున్న జలంధర్ పోలీసులు ఆమె ఆచూకీ కోసం దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. గత నెల 29వ తేదీన స్థానికంగా ఉండే ఎన్నారై దంపతుల 14 ఏళ్ల కూతురు పక్క వీధిలో ఉండే తన ఫ్రెండ్ వద్ద నోట్స్ తీసుకుని వస్తానని వెళ్లింది. అలా వెళ్లిన అమ్మాయి చాలా సమయం గడిచి తిరిగి ఇంటికి రాలేదు. దాంతో తల్లిదండ్రులు ఆమెకు ఫోన్ చేశారు. 


కానీ, బాలిక ఫోన్ స్వీచ్చాఫ్ అని వచ్చింది. ఆందోళన చెందిన తల్లిదండ్రులు వెంటనే ఆమె చెప్పిన ఫ్రెండ్ ఇంటికి వెళ్లి వాకాబు చేశారు. అయితే, ఆమె అక్కడి వెళ్లలేదని తెలిసింది. దాంతో వారు చుట్టుపక్కల అంతా వెతికారు. తెలిసిన వారి ఇళ్లకు కూడా వెళ్లి చూశారు. కానీ, ఎక్కడ ఆమె ఆచూకీ దొరకలేదు. దాంతో చేసేదేమిలేక జలంధర్ సీటీ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఫ్రెండ్ ఇంటికి నోట్స్ కోసమని వెళ్లిన కూతురు కనిపించకుండా పోయిందని వారు తమ ఫిర్యాదులో పేర్కొన్నారు. వారి సమాచారం మేరకు మిస్సింగ్ కేసు నమోదు చేసిన పోలీసులు బాలిక ఆచూకీ కోసం ముమ్మరంగా దర్యాప్తు చేస్తున్నారు. అక్కడి సీసీటీవీ కెమెరాల్లో రికార్డైన దృశ్యాలను పోలీసులు పరిశీలిస్తున్నారు. అలాగే చివరిసారిగా ఆమె ఫోన్ స్వీచ్చాఫ్ అయిన లోకేషన్ ఆధారంగా బాలిక కోసం పోలీసులు వెతుకున్నారు. 

Updated Date - 2021-09-04T19:09:57+05:30 IST