Jammu and Kashmir: డ్రోన్‌పై పోలీసుల కాల్పులు

ABN , First Publish Date - 2021-07-23T14:15:04+05:30 IST

జమ్మూ కశ్మీరులో శుక్రవారం ఉదయం ఓ డ్రోన్‌పై పోలీసులు కాల్పులు జరిపారు....

Jammu and Kashmir: డ్రోన్‌పై పోలీసుల కాల్పులు

మందుగుండు సామాగ్రి, పేలుడు పరికరం స్వాధీనం

జమ్మూ: జమ్మూ కశ్మీరులో శుక్రవారం ఉదయం ఓ డ్రోన్‌పై పోలీసులు కాల్పులు జరిపారు. జమ్మూ జిల్లా అఖ్నూరులో అంతర్జాతీయ సరిహద్దు 8కిలోమీటర్ల లోపల డ్రోన్ ఎగురుతుండగా జమ్మూకశ్మీర్ పోలీసులు కాల్పులు జరిపి కూల్చారు. ఈ డ్రోన్ లో 5కిలోల మందుగుండు సామాగ్రితోపాటు పేలుడు పరికరాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ డ్రోన్ ను లష్కరే తోయిబా ఉగ్రవాద సంస్థ మిలిటెంట్లు ప్రయోగించారని భద్రతా బలగాలు అనుమానం వ్యక్తం చేశాయి. ఉగ్ర దాడికి ఉగ్రవాదులు మోడస్ ఆపరేషన్ నిర్వహించారని జమ్మూ పోలీసులు భావిస్తున్నారు. 


జమ్మూలోని వైమానిక కేంద్రం వద్ద జూన్ 27వతేదీన డ్రోన్ కనిపించింది. ఆ తర్వాత జమ్మూలోని పలు ప్రాంతాల్లో పలు డ్రోన్లు కనిపించాయి. జమ్మూలో అంతర్జాతీయ సరిహద్దు సమీపంలో డ్రోన్ కనిపించడం మొదటిసారి.జమ్మూకశ్మీరులో ఉగ్రవాదులు డ్రోన్లతో దాడులకు ప్రయత్నిస్తున్నందున అప్రమత్తంగా ఉండాలని జమ్మూకశ్మీర్ డీజీపీ దిల్బాగ్ సింగ్ ఆదేశించారు.


Updated Date - 2021-07-23T14:15:04+05:30 IST