జమ్ముకశ్మీర్లో డీడీసీ అభ్యర్థిపై కాల్పులు
ABN , First Publish Date - 2020-12-04T21:27:04+05:30 IST
జమ్ముకశ్మీర్లో డీడీసీ అభ్యర్థిపై కాల్పులు
శ్రీనగర్: జమ్ముకశ్మీర్లో జిల్లా అభివృద్ధి మండలి (డీడీసీ) మూడో దశ ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో ఓ అభ్యర్థిపై గుర్తు తెలియని వ్యక్తులు కాల్పులు జరిపారు. దక్షిణ కశ్మీర్లోని కోకెర్నాగ్ ప్రాంతంలో ఈ ఘటన చోటుచేసుకుంది. కాల్పుల్లో గాయపడ్డ అభ్యర్థిని అనీస్ ఉల్ ఇస్లాంగా గుర్తించారు. వెంటనే గాయపడ్డ వ్యక్తిని ఆస్పత్రికి తరలించారు. అప్నీ పార్టీ తరపున డీడీసీ ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు.