15వ డివిజన్‌లో ‘జనంలోకి జనసేన’

ABN , First Publish Date - 2021-08-02T05:13:24+05:30 IST

జనసేన పార్టీ ఇచ్చిన పిలుపు మేరకు ఆ దివారం నగరంలోని 15వ డివిజన్‌లో జనంలోకి జన సేన కార్యక్రమాన్ని నిర్వహి ంచారు.

15వ డివిజన్‌లో ‘జనంలోకి జనసేన’
కరపత్రాలను పంపిణీ చేస్తున్న నాయకులు

ఒంగోలు(కలెక్టరేట్‌), ఆగస్టు 1 : జనసేన పార్టీ ఇచ్చిన పిలుపు మేరకు ఆ దివారం నగరంలోని 15వ డివిజన్‌లో జనంలోకి జన సేన కార్యక్రమాన్ని నిర్వహి ంచారు. ఈ సందర్భంగా నాయకులు డివిజన్‌లోని సమస్యలను ఆడిగి తెలుసు కున్నారు. ప్రధానంగా ఆస్తిపన్ను పెంపు, డ్రైనేజీ సమస్య, పింఛన్లు తదితర స మస్యలను ప్రజలు ఏకరవు పెట్టారు. జనంలోకి జనసేన పార్టీ ద్వారా ప్రజా స మస్యలు తెలుసుకొని వాటి పరిష్కారానికి పాటుపడటం జరుగుతుందని వారు తెలిపారు. పార్టీ జిల్లా అధ్యక్షుడు రియాజ్‌ నేతృత్వంలో అవసరమైతే పోరాటా లు చేసేందుకు కూడా వెనుకాడేది లేదన్నారు. కార్యక్రమంలో నాయకులు చిట్టెం ప్రసాద్‌, ముత్యాల కళ్యాణ్‌, టి.సుబ్బారావు, చెరుకూరి ఫణి, భూపతి రమేష్‌, బొందిల మదు, రాయపాటి అరుణ, ప్రమీల, కోమలి, శిరీష, తన్నీరు ఉష, తోట శబరి తదితరులు పాల్గొన్నారు. 


Updated Date - 2021-08-02T05:13:24+05:30 IST