రాజధాని అంశంపై ఏపీ హైకోర్టులో జనసేన అఫిడవిట్ దాఖలు

ABN , First Publish Date - 2020-09-23T18:40:08+05:30 IST

రాష్ట్ర ప్రజలకి రాజధానిపై ఉండే హక్కులను, రాజధాని కోసం భూములిచ్చిన రైతుల అంశంపై జనసేన పార్టీ హైకోర్టులో

రాజధాని అంశంపై ఏపీ హైకోర్టులో జనసేన అఫిడవిట్ దాఖలు

అమరావతి: రాష్ట్ర ప్రజలకు రాజధానిపై ఉండే హక్కులను, రాజధాని కోసం భూములిచ్చిన రైతుల అంశంపై జనసేన పార్టీ హైకోర్టులో అఫిడవిట్ దాఖలు చేసింది.  తమ్మిరెడ్డి శివశంకర్ రూపొందించిన అఫిడవిట్‌ను పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఆమోదంతో లాయర్  చల్లా అజయ్ కుమార్ కోర్టులో దాఖలు చేశారు. ఈ మేరకు పార్టీ కార్యాలయం ట్విట్టర్‌లో పోస్ట్ చేసింది. ‘‘రాష్ట్రానికి ఉన్న బాధ్యతలను రాజధాని కోసం భూములిచ్చిన రైతుల హక్కులను, రాష్ట్ర ప్రజలకి రాజధానిపై ఉండే హక్కులను జనసేన పార్టీ ఆలోచన విధానాన్ని ప్రతిబింబిస్తూ శివశంకర్ గారు తయారు చేసిన అఫిడవిట్, పవన్‌ గారి ఆమోదంతో లాయర్ శ్రీ చల్లా అజయ్ కుమార్ దాఖలు చేశారు’’ అంటూ ట్విట్టర్‌‌లో పేర్కొన్నారు. 

Updated Date - 2020-09-23T18:40:08+05:30 IST