చిరంజీవి రాజకీయాల్లో ఉండుంటే సీఎం అయ్యేవారు: పవన్

ABN , First Publish Date - 2020-12-04T01:24:29+05:30 IST

ఆశయ బలం ఉన్న వారికి ఓటమి కుంగుబాటును ఇవ్వదని జనసేన అధినేత పవన్‌కల్యాణ్ అన్నారు. కార్యకర్తల సమావేశంలో పవన్ కల్యాణ్ మాట్లాడారు. ‘చిరంజీవి ఇప్పటికీ రాజకీయాల్లో ఉండి ఉంటే.

చిరంజీవి రాజకీయాల్లో ఉండుంటే సీఎం అయ్యేవారు: పవన్

తిరుపతి: ఆశయ బలం ఉన్న వారికి ఓటమి కుంగుబాటును ఇవ్వదని జనసేన అధినేత పవన్‌కల్యాణ్ అన్నారు. కార్యకర్తల సమావేశంలో పవన్ కల్యాణ్ మాట్లాడారు. ‘చిరంజీవి ఇప్పటికీ రాజకీయాల్లో ఉండి ఉంటే.. ఇప్పుడు ముఖ్యమంత్రి అయి ఉండేవారు. అధికారం మనకు బాధ్యత, అలంకారం కాదు. అజమాయిషీ చేయటానికి అధికారం అని ఇప్పుడు అనుకుంటున్నారు. వైసీపీకి ఓటు వేసిన ప్రతి ఒక్కరూ బాధ్యత తీసుకోవాలి. భవిష్యత్తులో అలాంటి తప్పులు జరగకుండా చూసుకోవాలి. సిమెంటు ఫ్యాక్టరీ కోసమో, ఇసుక అమ్ముకోవటానికో, మద్యం అమ్ముకోవటానికో నేను సీఎం అవ్వాలనుకోలేదు’ అని చెప్పారు.


‘పవన్ సెల్ఫీ తీసుకోక పోతే ఓటు వేయనని నన్ను బెదిరించకండి. నేను మీ కోసం వచ్చాను. నన్ను పని చేసుకోనివ్వండి. ఫొటో తీసుకోలేదని నాపైన కోపం చూపించకండి. మిగిలిన వారు 25 కేజీలు బియ్యం ఇవ్వాలని చూస్తున్నారు. నేను 25 సంవత్సరాల భవిష్యత్తును ఇవ్వాలని చూస్తున్నాను. రైతు విలువ తెలియాలంటే ప్రతి ఒక్కరు ఒక గింజను నాటి మొక్కను సంరక్షించి చూడాలి. రైతుల కోసం, అమరావతి రైతు కోసం లాఠీలు విరివిగా ముందుకు వెళ్లటానికి సిద్ధంగా ఉన్నాను. రైతు కోసం, కౌలు రైతు కోసం జై కిసాన్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. కార్యాచరణను త్వరలో ప్రకటిస్తాం. మిగిలిన రాజకీయ నేతల్లా నాకు సిమెంట్ ఫ్యాక్టరీలు లేవు. మీడియా సంస్థలు లేవు. అందుకే సినిమాల్లో నటిస్తున్నాను’ అని పవన్ వెల్లడించారు.

Updated Date - 2020-12-04T01:24:29+05:30 IST