కరోనా తీవ్రతరమవుతోంది...అప్రమత్తత అవశ్యం: Pawan

ABN , First Publish Date - 2022-01-10T19:22:36+05:30 IST

రాష్ట్రంలో కరోనా వ్యాప్తిపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆందోళన వ్యక్తం చేశారు.

కరోనా తీవ్రతరమవుతోంది...అప్రమత్తత అవశ్యం: Pawan

అమరావతి: రాష్ట్రంలో కరోనా వ్యాప్తిపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆందోళన వ్యక్తం చేశారు. కరోనా తీవ్రతరమవుతోందని... అప్రమత్తత అవశ్యమన్నారు. అందుబాటులో ఉంటే డబుల్ మాస్క్ ధరించాలని సూచించారు. విందులు, సమావేశాలను కొన్నాళ్లపాటు వాయిదా వేసుకోవడం ఉత్తమమన్నారు. రాబోయే సంక్రాంతిని కూడా కుటుంబ సభ్యులతో మాత్రమే జరుపుకోవాలని కోరారు. ఇప్పటి వరకు టీకా తీసుకోనివారు తప్పనిసరిగా టీకా వేయించుకోవాలని తెలిపారు. కరోనా సెకండ్ వేవ్ ప్రభావంతో ఎంతో నష్టపోయామన్నారు. కరోనా వ్యాప్తి నేపథ్యంలో ప్రభుత్వాలు తక్షణమే అప్రమత్తం కావాలని పవన్‌ కళ్యాణ్ పేర్కొన్నారు. 

Updated Date - 2022-01-10T19:22:36+05:30 IST