ఎయిడెడ్‌ స్కూళ్లను మూసివేయవద్దు: పవన్ కల్యాణ్

ABN , First Publish Date - 2021-10-27T00:17:54+05:30 IST

రాష్ట్రంలోని ఎయిడెడ్‌ స్కూళ్లు, కాలేజీలను మూసివేయవద్దని ప్రభుత్వాన్ని

ఎయిడెడ్‌ స్కూళ్లను మూసివేయవద్దు: పవన్ కల్యాణ్

అమరావతి: రాష్ట్రంలోని ఎయిడెడ్‌  స్కూళ్లు, కాలేజీలను మూసివేయవద్దని ప్రభుత్వాన్ని ట్విట్టర్‌లో జనసేన అధినేత పవన్ కల్యాణ్ కోరారు. బెల్టులు, బూట్లు, అమ్మవడి మాకొద్దు.. తమ స్కూల్ తమకు కావాలని విద్యార్థులు కోరుతున్నారన్నారు. సీఎం డౌన్‌ డౌన్ అంటూ నిన్న విశాఖ జ్ఞానాపురం దగ్గర విద్యార్థులు, తల్లిదండ్రులు నినాదాలు చేసారని పవన్ ట్వీట్‌ చేసారు. ప్రభుత్వ ఎయిడెడ్‌ స్కూళ్లు, కాలేజీల మూసివేతకు అధికార వైసీపీ నిర్ణయంతో ఈ సమస్య ఏర్పడిందని పవన్‌ ట్వీట్‌ చేసారు. 


Updated Date - 2021-10-27T00:17:54+05:30 IST