హయగ్రీవ భూములను కబ్జా చేసేందుకు కుట్ర పన్నుతున్నారు: జనసేన నేత

ABN , First Publish Date - 2021-12-26T19:09:38+05:30 IST

హయగ్రీవ భూములను వైసీపీ నేతలు కబ్జా చేయడానికి కుట్ర పన్నుతున్నారని జనసేన నేత మూర్తి యాదవ్ అన్నారు.

హయగ్రీవ భూములను కబ్జా చేసేందుకు కుట్ర పన్నుతున్నారు: జనసేన నేత

విశాఖపట్నం: హయగ్రీవ భూములను వైసీపీ నేతలు కబ్జా చేయడానికి కుట్ర పన్నుతున్నారని జనసేన నేత మూర్తి యాదవ్ అన్నారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రాడిసన్, బేపార్క్.. ఇలా చాలా ఇప్పటికే వైసీపీ నేతల చేతుల్లోకి వెళ్లాయన్నారు. కమ్మ సామాజిక వర్గానికి చెందిన నేతల భూములను టార్గెట్ చేసి భయపెడుతున్నారని మండిపడ్డారు. జగన్, విజయసాయిరెడ్డి పేర్లు చెప్పి.. విశాఖ నేతలు భూ దందాకి పాల్పడుతున్నారని చెప్పారు. 500 కోట్ల రూపాయల భూ వివాదంపై విజయసాయిరెడ్డి ఎందుకు మౌనంగా ఉన్నారు? అని ప్రశ్నించారు. సీఎం జగన్మోహన్‌రెడ్డికి చిత్తశుద్ధి ఉంటే.. ఈ భూ వివాదంలో ఉన్న నేతలను పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని మూర్తి యాదవ్ డిమాండ్ చేశారు. 

Updated Date - 2021-12-26T19:09:38+05:30 IST