జాబ్ క్యాలెండర్ పేరుతో మోసం: నాదెండ్ల మనోహర్
ABN , First Publish Date - 2021-06-19T02:39:55+05:30 IST
జాబ్ క్యాలెండర్ పేరుతో నిరుద్యోగ యువతను మోసం చేశారని ప్రభుత్వంపై జనసేన
అమరావతి: జాబ్ క్యాలెండర్ పేరుతో నిరుద్యోగ యువతను మోసం చేశారని ప్రభుత్వంపై జనసేన పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏపీపీఎస్సీ ద్వారా గ్రూప్ 1, గ్రూప్ 2లో భర్తీ చేసేది కేవలం 36 పోస్టులా అని నాదెండ్ల ప్రశ్నించారు. డీఎస్సీ గురించి ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలని మనోహర్ డిమాండ్ చేశారు. శాఖల వారీగా ఉన్న ఖాళీలపై శ్వేతపత్రం విడుదల చేయాలని నాదెండ్ల మనోహర్ కోరారు.