AP: మధ్యాహ్నం జనసేన కార్యాలయానికి పవన్
ABN , First Publish Date - 2021-09-30T16:43:31+05:30 IST
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఈరోజు మధ్యాహ్నం ఆ పార్టీ కార్యాలయానికి చేరుకోనున్నారు.
అమరావతి: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఈరోజు మధ్యాహ్నం ఆ పార్టీ కార్యాలయానికి చేరుకోనున్నారు. అక్టోబర్ 2న రోడ్ల శ్రమదానంపై పీఏసీ సభ్యులతో జనసేనాని చర్చించనున్నారు. అన్ని నియోజకవర్గాలలో జన సైనికులు, ప్రజలు పాల్గొనేలా కార్యాచరణ రూపొందించనున్నారు. కాగా పవన్ మీడియా సమావేశం లేదని పార్టీ ముఖ్య నేతలు స్పష్టం చేశారు. మరోవైపు కాటన్ బ్యారేజిపై శ్రమదానానికి ఇరిగేషన్ అధికారులు అనుమతి నిరాకరించారు.