తల్లి ఎవరికైనా తల్లే సీఎం గారు గుర్తుపెట్టుకోండి: Potina
ABN , First Publish Date - 2021-10-21T16:43:16+05:30 IST
ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డిపై జనసేన నేత పోతిన వెంకట మహేష్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.
విజయవాడ: ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డిపై జనసేన నేత పోతిన వెంకట మహేష్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ‘‘తల్లి ఎవరికైనా తల్లే సీఎం గారు గుర్తుపెట్టుకోండి...మీ తల్లిని దూషించారని బాధపడిన మీరు కాకినాడలో మీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి, పవన్ కళ్యాణ్ గారి మాతృమూర్తిని దూషించారు... ఆనాడు కూడా ఇదే ఆవేదన వ్యక్తం చేస్తే ప్రజలు మిమ్మలని నమ్మేవారు... నేతి బీరకాయలో నెయ్యి, సీఎం జగన్ గారి మాటల్లో నిజాయితీ ఎప్పటికీ దొరకవు’’ అని పోతిన వెంకట మహేష్ వ్యాఖ్యానించారు.