రాజధాని వికేంద్రీకరణకు ప్రజామోదం లేదు: చంద్రశేఖర్

ABN , First Publish Date - 2020-08-02T18:54:37+05:30 IST

రాజధాని వికేంద్రీకరణకు ప్రజామోదం లేదు: చంద్రశేఖర్

రాజధాని వికేంద్రీకరణకు ప్రజామోదం లేదు: చంద్రశేఖర్

అమరావతి: రాజధాని వికేంద్రీకరణకు పూర్తి స్థాయిలో ప్రజామోదం కనిపించడం లేదని జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి తోట చంద్రశేఖర్ అన్నారు. ఆదివారం జనసేన పార్టీ పొలిటికల్ అఫైర్స్ కమిటీ టెలీ కాన్ఫరెన్స్‌లో ఆయన మాట్లాడుతూ ప్రజలు ఉద్యమించాలన్నా కోవిడ్ పరిస్థితులు అందుకు అనుగుణంగా లేవన్నారు. ఈ అంశంపై న్యాయపరమైన పోరాటం చేపట్టాల్సిన సమయం వచ్చిందని తెలిపారు. అమరావతిలో రాజధాని కోసం వేల ఎకరాలను రైతులు ప్రభుత్వానికి ఇచ్చారని... ప్రభుత్వం మారగానే తరలిస్తున్నారని విమర్శించారు. ఇలా చేస్తే ప్రభుత్వం మీద ప్రజలకు భరోసా పోతుందన్నారు. ఇకపై భూ సమీకరణలు, భూసేకరణలు చేపడితే ప్రజలు ఏం నమ్మి భూములు ఇస్తారని చంద్రశేఖర్ ప్రశ్నించారు. 


కె.నాగబాబు మాట్లాడుతూ... “రాజధాని విషయంలో తొలి నుంచి ఒకే విధానం, ఒకే మాట మీద ఉన్నది జనసేన అధ్యక్షులు పవన్ కల్యాణ్  మాత్రమే. అన్ని వేల ఎకరాల భూమిని సమీకరిస్తే ఏదైనా సమస్య ఉత్పన్నమైతే రైతులకు ఎవరు భరోసాగా ఉంటారని  2015లోనే బలంగా మాట్లాడారు. ప్రభుత్వంతో ఒప్పందం మేరకు రైతులు భూములు ఇచ్చారు. ఇప్పుడు రాజధాని తీసుకువెళ్లిపోతే బ్రీచ్ ఆఫ్ ట్రస్ట్ అవుతుంది. ప్రభుత్వమే మోసం చేస్తోంది. ఈ పరిస్థితి ఉత్పన్నం కావడానికి ప్రధాన కారకులు చంద్రబాబు నాయుడే. ఆయన నాడు చేసిన తప్పిదాల వల్లనే నేడు  జగన్ తనకు అనుకూలంగా మార్చుకొని రాజధాని తరలించుకొని వెళ్తున్నారు” అని ఆగ్రహం వ్యక్తం చేశారు. 

Updated Date - 2020-08-02T18:54:37+05:30 IST