నాడు Pawan kalyan చెప్పిందే... నేడు ఏపీలో జరుగుతోంది..

ABN , First Publish Date - 2021-10-21T05:37:47+05:30 IST

సీఎంగా గెలిచిన తర్వాత తాడేపల్లి ప్యాలెస్‌ దాటి...

నాడు Pawan kalyan చెప్పిందే... నేడు ఏపీలో జరుగుతోంది..

  • జనసేన జిల్లా అధ్యక్షుడు గాదె వెంకటేశ్వరరావు

గుంటూరు. అక్టోబర్‌ 20: ఆర్థిక నేరగాడికి ఓట్లు వేయవద్దని, వారిని గెలిపిస్తే రౌడీరాజ్యం వస్తుందని నాడు పవన తెలిపారు. కానీ ప్రజలు వినలేదు. ఏదో అభివృద్ధి చేస్తాడని నమ్మి వైసీపీకి ఓట్లు వేశారు. నేడు పవన చెప్పినట్లే జరుగుతోంది. రౌడీరాజ్యం నడుస్తోంది... అని జనసేన పార్టీ జిల్లా అధ్యక్షుడు గాదె వెంకటేశ్వరరావు అన్నారు. లాడ్జి సెంటర్‌లోని పార్టీ కార్యాలయంలో బుధవారం జరిగిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో శాంతి భద్రతల పరిస్థితులు ఇంతగా దిగజారితే అదుపు చేయాల్సిన పోలీసు శాఖ ఘోరంగా విఫలమైనట్లు ఆయన ధ్వజమెత్తారు. ఎన్నికల ముందు రాష్ట్రమంతా పాదయాత్రలు చేసిన వైఎస్‌ జగన్, సీఎంగా గెలిచిన తర్వాత తాడేపల్లి ప్యాలెస్‌ దాటి అడుగు బయటకు పెట్టడం లేదని ఆయన విమర్శించారు.  సమావేశంలో జనసేన నేతలు అడపా మాణిక్యాలరావు, నారదాసు ప్రసాద్‌, తోట రాజా రమేష్‌, శిఖా బాలు, తన్నీరు గంగరాజు, యర్రగోపుల రమేష్‌, దాసరి వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.



Updated Date - 2021-10-21T05:37:47+05:30 IST