ఒమైక్రాన్ ఎఫెక్ట్.. విదేశీ ప్రయాణికులపై జపాన్ తాజా నిర్ణయం ఇదీ..!

ABN , First Publish Date - 2021-11-29T20:56:16+05:30 IST

దక్షిణాఫ్రికాలో తొలుత వెలుగులోకి వచ్చిన కరోనా వేరియంట్.. ఒమైక్రాన్ ప్రపంచ దేశాల్లో గుబులు పుట్టిస్తోంది. ఇంతకు ముందు వేరియంట్లతో పోల్చితే.. ఒమైక్రాన్ వేగంగా వ్యాప్తి చెందుతున్నందువల్ల ప్రపంచ దేశాలు వణికిపోతు

ఒమైక్రాన్ ఎఫెక్ట్.. విదేశీ ప్రయాణికులపై జపాన్ తాజా నిర్ణయం ఇదీ..!

ఎన్నారై డెస్క్: దక్షిణాఫ్రికాలో తొలుత వెలుగులోకి వచ్చిన కరోనా వేరియంట్.. ఒమైక్రాన్ ప్రపంచ దేశాల్లో గుబులు పుట్టిస్తోంది. ఇంతకు ముందు వేరియంట్లతో పోల్చితే.. ఒమైక్రాన్ వేగంగా వ్యాప్తి చెందుతున్నందువల్ల ప్రపంచ దేశాలు వణికిపోతున్నాయి. దీంతో కరోనా ఆంక్షలను మళ్లీ అమలు చేస్తున్నాయి. ఈ క్రమంలోనే తాజాగా జపాన్ కీలక నిర్ణయం తీసుకుంది. విదేశీ ప్రయాణికులపై నిషేధం విధిస్తూ ఆదేశాలు జారీ చేసింది. మంగళవారం నుంచి ఈ నిబంధనలు అమలులోకి వస్తాయని ఆ దేశ ప్రధాని పుమియో కిషిదా ఓ ప్రకటనలో వెల్లడించారు. ప్రపంచ వ్యాప్తంగా పలు దేశాల్లో కేసులు వెలుగులోకి వచ్చిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్టు పేర్కొన్నారు. 




Updated Date - 2021-11-29T20:56:16+05:30 IST