ఒకే ప్రసంగాన్ని రిపీట్ చేసిన జపాన్ ప్రధానిపై విమర్శలు..!

ABN , First Publish Date - 2020-08-14T03:52:15+05:30 IST

జపాన్ ప్రధాని షింజో అబే ఓకే ప్రసంగాన్ని రెండు సందర్భాల్లో వినిపించారంటూ అక్కడి ప్రజలు విమర్శల ప్రస్తుతం ఆయనపై విరుచుకుపడుతున్నారు.

ఒకే ప్రసంగాన్ని రిపీట్ చేసిన జపాన్ ప్రధానిపై విమర్శలు..!

టోక్యో: జపాన్ ప్రధాని షింజో అబే ఓకే ప్రసంగాన్ని రెండు సందర్భాల్లో వినిపించారంటూ అక్కడి ప్రజలు విమర్శల ఆయనపై విరుచుకుపడుతున్నారు. పూర్తి వివరాల్లోకి వెళితే.. జపాన్‌పై అణుదాడి జరిగి 75 సంవత్సరాలు కావస్తున్న సందర్భంగా హిరోషిమా, నాగసాకీ నగరాల్లో ఇటీవల ప్రభుత్వం రెండు ప్రత్యేక కార్యక్రమాలను ఏర్పాటు చేసింది. నాలుగు రోజుల వ్యవధిలో జరిగిన ఈ సభలకు ప్రధాని షింజో అబే కూడా హాజరయ్యారు. అయితే రెండు సందర్భాల్లోనూ ఆయన ఇంచుమించుగా ఓకే ప్రసంగాన్ని చదివి వినిపించినట్టు ఓ ప్రముఖ సాఫ్ట్‌వేర్ పట్టేసింది. రెండు ప్రసంగాల మధ్య ఏకంగా 93శాతం సారూప్యత ఉందని లెక్కగట్టి మరీ చెప్పింది. ఈ విషయం సోషల్ మీడియాలో బాగా వైరల్ అవడంతో ప్రస్తుతం జపాన్ ప్రధాని విమర్శలను ఎదుర్కొంటున్నారు. 75 ఏళ్ల క్రితం జరిగిన అణుదాడిలో ఏకంగా రెండు లక్షల మంది ప్రజలు అసువులు బాసిన విషయం తెలిసిందే.

Updated Date - 2020-08-14T03:52:15+05:30 IST