విల్లుతో తల్లిని, బామ్మను చంపిన యువకుడు.. జపాన్‌లో..

ABN , First Publish Date - 2020-06-05T02:16:30+05:30 IST

జపాన్‌లో విషాధ సంఘటన చోటుచేసుకుంది. ఒసాకాకు సమీపంలోని

విల్లుతో తల్లిని, బామ్మను చంపిన యువకుడు.. జపాన్‌లో..

టోక్యో: జపాన్‌లో విషాధ సంఘటన చోటుచేసుకుంది. ఒసాకాకు సమీపంలోని తకరాజుకా నగరంలో ఓ యువకుడు క్రాస్ బౌ(ఒక విధమైన విల్లు)తో తన తల్లిని, అమ్మమ్మను హతమార్చాడు. ఇదే ఘటనలో మరో ఇద్దరికి గాయాలవడంతో వారు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నిందితుడు కారణంగా 40, 70 ఏళ్ల వయసున్న ఇద్దరు మహిళలు మరణించారని.. ఇద్దరూ కూడా నిందితుడి కుటుంబసభ్యులేనని చెప్పారు. గాయపడిన మరో ఇద్దరు కూడా కుటుంబసభ్యులేనని పేర్కొన్నారు. ప్రస్తుతం నిందితుడు పోలీసుల అదుపులో ఉన్నాడు. మనవడు తనను బాణంతో దాడి చేశాడంటూ.. 70 ఏళ్ల వృద్దురాలు ఫోన్ చేయడంతో తాము ఘటనా స్థలానికి వెళ్లినట్టు పోలీసులు పేర్కొన్నారు. జపాన్‌లో ఇటువంటి హింసతో కూడిన నేరాలు చాలా అరుదుగా జరుగుతుంటాయని పోలీసులు తెలిపారు. నిందితుడు ఇంతటి దారుణానికి ఎందుకు పాల్పడ్డాడో తెలియాల్సి ఉంది. పోలీసులు నిందితుడిని ప్రశ్నించగా.. ‘నా కుటుంబంలో చాలా మందిని హతమార్చా’ అని నేరాన్ని అంగీకరించాడు. అసలు ఏ కారణం చేత కుటుంబసభ్యులను హతమార్చాడన్న దానిపై దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు.

Updated Date - 2020-06-05T02:16:30+05:30 IST