జాసాప రాష్ట్రస్థాయి పురస్కారాలు
ABN , First Publish Date - 2021-03-29T07:37:42+05:30 IST
జాతీయ సాహిత్య పరిషత్ సిద్ధిపేట శాఖ 34వ వార్షికోత్సవం మార్చి 30 సా.4 గం.లకు ప్రెస్క్లబ్ సిద్ధిపేటలో జరుగుతుంది. ఇందులో భాగంగా...
జాతీయ సాహిత్య పరిషత్ సిద్ధిపేట శాఖ 34వ వార్షికోత్సవం మార్చి 30 సా.4 గం.లకు ప్రెస్క్లబ్ సిద్ధిపేటలో జరుగుతుంది. ఇందులో భాగంగా పుస్తకావిష్కరణలతోపాటు సాహిత్యంలో విశేష కృషి చేసినవారికి రాష్ట్ర స్థాయి పురస్కారాల ప్రదానం ఉంటుంది. గాడెపల్లి వీరమ్మ, వెంకటయ్య యువ సాహిత్య పురస్కారం - మెతుకు రాజశేఖర్ (మెదక్), తడకమడ్ల సాంప్రదాయ సాహిత్య పురస్కారం - సంగవీని రవీంద్ర (ముంబా యి), ఐతా భారతీ - చంద్రయ్య సాంప్ర దాయ కథా పురస్కారం - చెన్నూరి సుద ర్శన్ (హైదరాబాద్), సంటి అనిల్ కుమార్ బాలసాహిత్య పురస్కారం - పెందోట వెంకటేశ్వర్లు (సిద్ధిపేట), కనపర్తి వచన కవితా పురస్కారం - తిరునగరి వకుల (హైదరాబాద్) స్వీకరిస్తారు.
ఉండ్రాళ్ళ రాజేశం